రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యకు కారణం ఇదే

by Mahesh |
రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యకు కారణం ఇదే
X

దిశ, మక్తల్: ఈ రోజు తెల్లవారుజామున రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వారి ఆత్మహత్యకు గల కారణాలు బంధువులు తెలిపారు. వలస కూలీలుగా ఉంటున్న వారు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి తాత్కాలిక గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి పని చేసుకుని వచ్చే వారు. ఈ క్రమంలోనే మణికుమార్(25) అనిత(16) మధ్య స్నేహం, ఏర్పడి ప్రేమగా మారింది. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. ఆ అమ్మాయి ముణికుమార్ కు వరుసకు అన్న బిడ్డ అవుతుందని తెలిపారు. దీంతో తమకు పెళ్లి జరగదిని బావించిన ఇద్దరు ఆదివారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కృష్ణ చేగుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : పెళ్లి చేసుకొమ్మన్నందుకు యువతిపై దాడి

Next Story

Most Viewed